రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారిపై దాడికి నిరసనగా నిరసన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,
(ప్రశ్న ఆయుధం) జూన్ 19
రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారిపై దాడికి నిరస నగా నిరసన కార్యక్రమాలు ధర్నా నిర్వహించామ ని కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల ప్రాథమిక వైద్య సిబ్బంది తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, గత (17) వ తేదీన రాత్రి సుమారు (8:45) నిమిషాలకు కామారెడ్డి పట్టణంలో కల్కి నగర్, కాలనీలో నివాసం ఉంటున్న రామారెడ్డి మండల వైద్యాధికారి డా ,సురేష్ ఇంటికి వెళ్లి ఆయనపై దౌర్జన్యంగా దాడి చేసిన దేవునిపల్లి పి హెచ్ సి డీఈఓ రాజు (మాజీ రామారెడ్డి ఉద్యోగస్తు డూ ) , జుక్కల్ ప్రభుత్వ హాస్పిటల్ జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించే సుభాష్ అనే ఇద్దరు వ్యక్తులు అసభ్యకర పదాలతో, వ్యక్తిగత కారణాలతో, లేనిపోని అపనిందలు డాక్టర్ పై మోపి అకారణంగా దాడి చేశారు. ఈ దాడి లో డాక్టర్ సురేష్ కు స్వల్పంగా గాయాలు అయ్యాయి, ఈ దాడిని ఏకధాటిగా రామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది ఖండిస్తూ, ఇతర ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది అందరూ ఖండించామని అన్నారు. జిల్లా వైద్యాధికారులు, పోలీస్ అధికారు లు, జిల్లా కలెక్టర్ దాడి చేసిన ఇద్దరిపై కట్టిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన ఇద్దరి పై చర్యలు తీసుకో లేని ఎడల వైద్య సిబ్బంది వారు , ఉద్యోగస్తులు ధర్నాలు , రాస్తా రోకోలు , నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి సిబ్బంది తో పాటు అన్నారం పభుత్వ వైద్య సిబ్బంది, రాజంపేట ప్రభుత్వ వైద్య , బిక్కనూర్ వైద్య సిబ్బంది, కామారెడ్డి అర్బన్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.