Site icon PRASHNA AYUDHAM

ఎస్ ఆర్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని కళాశాలలోనే మృతి

IMG 20250803 WA0025

ఎస్ ఆర్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని కళాశాలలోనే మృతి

హనుమకొండ: నయీమ్ నగర్ ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో ఎం పి సి మొదటి సంవత్సరం చదువుతున్న మంచిర్యాల కు చెందిన మిట్టపల్లి శివాని (16)అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది… కాగా విద్యార్థిని కుటుంబీకులకు ఎలాంటి సమాచారం అందించకుండానే మృత దేహాన్ని కళాశాల యాజమాన్యం వరంగల్ ఎంజీఎం కి తరలించారు.

గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఎంజిఎంకు మార్చురీకి తరలించడం పై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

ఇదిఇలావుంటే మృతురాలు రాసిన సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో లభ్యమైంది.

కళాశాలలో చేర్చే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఆ లేఖలో శివాని తన అవేదన వ్యక్తం చేసింది.

Exit mobile version