రేషన్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి తెల్ల రేషన్ కార్డు

*రేషన్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి తెల్ల రేషన్ కార్డు*

జమ్మికుంట మే 10 ప్రశ్న ఆయుధం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నిలబె ట్టుకుంటూ వచ్చిందని పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తూ వారి కళ్ళల్లో ఆనందం చూసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిందని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డ్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ పాతకాల రమేష్ ఆన్నారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ పాతకాల రమేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. పది సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ అప్పటి ప్రభుత్వ అధికారులు స్పందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి లబ్ధిదారులకి రేషన్ కార్డులు అందిస్తూ వారికి సన్న బియ్యాన్ని అందిస్తుందని తెలిపారు. 15వ వార్డు ప్రజలు గతంలో రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోగా అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగిందని ఇంకెవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబం సన్నబియ్యాన్ని రేషన్ షాప్ ల ద్వారా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. వార్డులో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజల అభివృద్దే తన ద్యేయమని వారి ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment