బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ KBCలో రూ.50లక్షలు గెలుచుకున్న విన్నర్..
బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఓ యువతి బంపర్ ఆఫర్ తగిలింది. కౌన్ బనేగా కరోడ్పతిలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నారు. రాజస్థాన్కు చెందిన నరేషి మీనా 2018లో SI పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో వైద్యం కోసం ప్రతి రూపాయి కూడబెట్టారు. ఇటీవల కేబీసీలో రూ.50 లక్షలు గెలుచుకున్నారు. చికిత్స బాధ్యత తానే తీసుకుంటానని హోస్ట్ అమితాబ్ హామీ ఇచ్చారు.