Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాదంలో మిషన్ భగీరథ కార్మికుడు మృతి

IMG 20240730 WA0161

*రోడ్డు ప్రమాదంలో మిషన్ భగీరథ కార్మికుడు మృతి*

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 30(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శివ్వంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు బిక్షపతి(55) మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version