ఆన్ లైన్ బెట్టింగ్ లకు బలైన యువకుడ..
రైలు కిందపడి యువకుడు ఆత్మ హత్య..
మృతుడు మదనపల్లె పట్టణవాసిగా గుర్తించిన కదిరి రైల్వే పోలీసులు..
ఆన్ లైన్ బెట్టింగులకు ఓయువకుడు బలైన సంఘటన ఆదివారం మధ్యాహ్నం మదనపల్లె మండలంలో తీవ్రకలకలంరేపింది. కదిరి రైల్వే ఎస్ఐ రహీం, హెడ్ కానిస్టేబుల్ బాష తెలిపిన వివరాలమేరకు.. మదనపల్లె పట్టణం, అమ్మినేనివీధికి చెందిన ఆర్యవైశ్య హోటల్ నిర్వాహకులు వెంకటరాజు, సరస్వతిల ఒక్కగా నొక్కకొడుకు అమర్ తేజ(30) ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.25లక్షలు పోగొట్టుకొని అప్పులపాలై కాశిరావుపేట వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు