Site icon PRASHNA AYUDHAM

అబ్దుల్ రజాక్ న్యాయవాది సతీమణి అనారోగ్యంతో మృతి

IMG 20250622 WA0207

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సీనియర్ న్యాయవాది అబ్దుల్ రజాక్ సతీమణి శంషధా బేగం(55) అనారోగ్యంతో పరమపదించింది.వారికి అత్యంత సన్నిహితులైన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ , కొత్తగూడెం లో గల అబ్దుల్ రజాక్ గృహాన్ని సందర్శించి,
పార్థివదేహానికి నివాళులు అర్పించారు.జీవిత భాగస్వామిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న అబ్దుల్ రజాక్ ని ఓదారుస్తూజనన మరణాలు మన చేతిలో ఉండవని అవి భగవత్ సంకల్పాలని, మనకు దేవుడు ఇచ్చిన ఈ ఉత్తమమైన మానవ జన్మకు సార్ధకతగా, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని, ఈ సమాజంలోని నిరుపేదలకు అవసరత ఉన్నవారికి, అభాగ్యులను అనాధలను ఆదుకోవాలని అదే మానవ జన్మకు సార్థకత అని,ఓదార్చి ఆదరించారు.ఆత్మీయ ఓదార్పు కార్యక్రమంలో అబ్దుల్ రజాక్,CPI జిల్లా కార్యదర్శి మరియు నిరంతర సేవా తత్పరులు శ్రీ ఎస్ కే సాబీర్ పాషా, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు శ్రీ నయీమ్ కురేషి,సీనియర్ జర్నలిస్ట్ లోగాని శ్రీనివాస్, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రఘురాం,
సత్తార్ ,పాషా,అక్రమ్,శంకర్ తదితరులు ఉన్నారు.

Exit mobile version