Site icon PRASHNA AYUDHAM

మున్సిపల్ కమిషనర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ..!

IMG 20240723 WA0056

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్.రాజా మల్లయ్య లంచం డిమాండ్ చేసి తీసుకునందుకు అరెస్ట్ చేసిన ఏసీబీకి అధికారులు.హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఎనిశెట్టి సుదర్శన్ అనే వ్యక్తి నుండి 50 వేలు లంచం తీసుకున్నట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఏసీబీ అధికారులు మల్లయ్య నుంచి లంచం సొమ్మును రికవరీ చేసి రసాయన పరీక్ష నిర్వహించగా.. లంచం తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జూలై23

Exit mobile version