మద్నూర్ ఆర్టీఏ చెక్పోస్ట్పై ఏసీబీ దాడులు
ప్రశ్న ఆయుధం 26 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి )
కామారెడ్డి జిల్లా మద్నూర్ ఆర్టీఏ చెక్పోస్ట్లో అవినీతి ఆరోపణలపై గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ చెక్పోస్ట్ ద్వారా ప్రతి రోజూ వందలాది వాణిజ్య వాహనాలు, ముఖ్యంగా లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాహనాల తనిఖీ పేరుతో ఆర్టీఏ సిబ్బంది లారీ డ్రైవర్ల వద్ద నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. కొందరు డ్రైవర్లు చెక్పోస్ట్ బాక్సులో నగదు వేసి వెళ్లిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.దీనివల్ల వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేయగా, అక్కడ కొన్ని పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.