సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): గొల్లగూడెం, సదాశివపేట బైపాస్ జంక్షన్ వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లెటర్ ప్యాడ్ తో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు శివరాజ్ పాటిల్, సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, సదాశివపేట చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చింత ఆనంద్ లు అందజేశారు. బుధవారం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు స్థలం కేటాయించాలని సదాశివపేట పురపాలక సంఘం కౌన్సిల్ వారి ముందు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. అట్టి స్థలాన్ని సదాశివపేట మున్సిపల్ కమిషనర్ తో పాటు కౌన్సిలర్లు పరిశీలించారు.