నిబంధనలకి విరుద్ధంగా ఉన్న ఒకేషనల్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
– జిల్లా నోడల్ అధికారి షేఖ్ సలాం, కి బీసీ విద్యార్థి సంఘం,టీజేఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 25
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒకేషనల్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, కు బుధవారం వినతి పత్రాన్ని బీసీ విద్యార్థి సంఘం టీజేఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్, లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓకేషనల్ కళాశాలల్లో, సరియైన మౌలిక సదుపాయాలు లేకున్నా, పరిశోధన పరికరాలు లేకున్నా,సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బోధన సిబ్బంది లేకున్నా నడుపుతున్న ఒకేషనల్ కళాశాల లపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధి కల్పనే ధ్యేయంగా సాంకేతిక కోర్సుల కోసం బడుగు,బలహీన వర్గాల విద్యార్థులే ఎక్కువగా చేరుతున్న క్రమంలో వాళ్ళకి సరియైన వసతులు కల్పించడం లేదు, ప్రాక్టికల్స్ సరిగ్గా చేయంచడం లేనందువల్ల ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే విద్యార్థులకు విషయ పరిజ్ఞానం ఉండక ఉపాధి దొరకడం లేదన్నారు.విద్యార్థుల నుండి వేళకు వేలు రూపాయల వసూలు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.నియమ నిబంధనలకు విరుద్ధంగా సరియైన అనుమతులు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని,సదుపాయాలు లేని కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు.కోర్సు పూర్తి అయ్యి విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా పేద మధ్యతరగతి యువకులు మిగిలి పోతున్నారన్నారు.