జిల్లా కలెక్టర్ ఎస్సై నాగేష్ పై చర్యలు తీసుకోవాలి …

మున్సిపల్ కార్మికులకు ప్రతినెల 5వ తేదీ లోపు జీతాలు చెల్లించాలి

– మున్సిపల్ కార్మికులను ఇబ్బంది పెడుతున్న ఎస్సై నాగేష్

– జిల్లా కలెక్టర్ ఎస్సై నాగేష్ పై చర్యలు తీసుకోవాలి

– తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజనర్సు ( సిఐటియు )

– కామారెడ్డి

IMG 20250516 WA00181

కార్మికులకు వేతనాలు చెల్లించాలని గత ఐదు ఆరు రోజులుగా అధికారులను అడుగుతున్న ఎవరు స్పందించడం లేదని, మున్సిపల్ కార్మికులను వివిధ రకాలుగా ఎస్సై నాగేష్ ఇబ్బంది పెడుతున్నాడని మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ( సిఐటియు ) రాజనర్సు అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఆర్ ఐ గోపాల్ రెడ్డికి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజనర్సు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఇబ్బంది పెడుతున్న ఎస్సై నాగేష్ పై కలెక్టర్ చర్య తీసుకోవాలని కలెక్టర్ కోరుతున్నామన్నారు. తమకు మున్సిపల్ నుండి గత ఆరు నెలలుగా పి ఎఫ్, ఈఎస్ ఐ జమచేయకపోవడంతో శుక్రవారం మున్సిపల్ కార్మికులు విభాగంలో ఉదయం ఐదు గంటలకు పనులు బంద్ చేసి ఎస్సై నాగేష్ కి ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కారం కోసం అడగగా మీ సమస్యలతో నాకు సంబంధం లేదని, వేతనాలు వచ్చిన రాకున్నా విధులు మాత్రం చేయాలని ఫోన్లో సమాధానం ఇవ్వగా, మున్సిపల్ కమిషనర్ కి ఫోన్లో తమ వేతనాల విషయం అడగగా ఇంకా టైం పడతదని మీ ఇష్టం అనే విధంగా మాట్లాడడంతో మున్సిపల్ కార్మికులము మనోవేదనకు గురై ఉదయం 5 గంటల నుండి పనులు బంద్ పెట్టి మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా చేసిన ఏ ఒక్క అధికారి గాని, సెక్షన్ సంబంధించిన అధికారులు కానీ సమాధానం చెప్పకపోవడంతో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ మున్సిపల్ కార్మికులకు ప్రతినెల ఐదు తారీకు జీతాలు రావాలని, 11 మందిని తీసివేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఆరు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానం లో వారి వారసులకు ఒక్కరికి ఉద్యోగము ఇచ్చి వారికి చదువు రిత్య ప్రమోషన్ కల్పించలన్నారు. కార్మికుల స్థానం లో వారి కుటుంబంలో ఒక్కరిని పెట్టుకున్న పెట్టుకోవాలన్న జిఒ ఉన్నప్పటికీ 60 సంవత్సరాల నిండిన కార్మికులు స్థానంలో వారి కుటుంబ సభ్యులను పెట్టుకోవడం లేదన్నారు. ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో మానవత దృప్కథం తో వారి స్థానంలో బదిలీ పెట్టుకునే అవకాశాన్ని ఉందని అలా చేయాలని ఎస్సై నాగేష్ కు మున్సిపల్ కమిషనర్ చెప్పిన ఎస్సై నాగేష్ వినడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులను అనేక ఇబ్బందులు గురి చేస్తు మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని వస్తే వారిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడి బెదిరిస్తున్నాడు అన్నారు. ఎస్సై నాగేష్ తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ కింది స్థాయి జవాన్లను, కార్మికులను రివ్యూ మీటింగ్ పేర్లతోటి అతని ఇష్టం వచ్చినట్లు ఉదయం, మధ్యాహ్నం పూట రివ్యూ మీటింగ్ పేర్లతోటి కార్మికులను జవాన్లను వేధిస్తున్నాడన్నారు. దీనికి కారణం అతనికి మున్సిపల్ లో మరో అధికారి అండదండలు ఉన్నాయన్నారు. అతను రాజకీయ నాయకుల అండదండలతో కార్మికుల మధ్య చిచ్చు పెడుతూ గ్రూపులుగా ఏర్పాటు చేస్తున్నాడన్నారు. రాజకీయాలకు తొత్తుగా మారి ఇక్కడనే సిస్ట వేస్తూ ఎంతో మంది కడుపు కొడుతున్నాడు.ఇతనిపై జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలని కోరుతున్నామన్నారు. మున్సిపల్ లో కార్మికులుగా అత్యధికంగా దళితులు, మధ్యతరగతి కి చెందిన వారే ఉన్నారన్నారు. ఈ మున్సిపల్ పై మూడు పార్టీల నాయకులు పెత్తనం చలాయించడంతో వారి మధ్య కార్మికులను నలిగిపోతున్నామని కలెక్టర్ దృష్టి సారించి ఏ రాజకీయ నాయకునికి మున్సిపల్ కు సంబంధం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం ( సిఐటియు ) జిల్లా కార్యదర్శి మహబూబ్, కామారెడ్డి శానిటేషన్ ఉపాధ్యక్షులు సంతోష్, దీవెన, శివరాజవ, జ్యోతి, మున్సిపల్ కార్మికులు గురియాల నర్సింలు, లక్ష్మీ రాజ్, బెల్లి కిషన్, యాదగిరి, అంజి, లడ్డు, కిషన్ రాజ్, ఇంద్ర, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now