*ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి*
*అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి*
*ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్*
*జమ్మికుంట జూన్ 19 ప్రశ్న ఆయుధం*
ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అధిక పీసులు వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్ అన్నారు గురువారం రోజున జమ్మికుంట పట్టణంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు అధ్యక్షతన ఏఐఎస్ఎఫ్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి హాజరైన ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పించాలని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సమీక్ష నిర్వహించాలని కోరారు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోతే మంత్రులను అడ్డుకుంటామని, విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇంకెప్పుడు ఇస్తారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంపై సమీక్ష చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విద్యారంగం గాడి తప్పిందని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యాలు లేవని, ప్రభుత్వ గురుకులాలకు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు బిల్లులు చెల్లించక అందులో చదివే విద్యార్థులు ఇంటి వద్ద ఉండే పరిస్థితి ఉందని, పాఠశాల కళాశాలలో యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గురుకులాలు మోడల్ స్కూల్లో కేజీబీవీ లలో నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేయాలని విద్యార్థులు లేరని సాకుతో ప్రభుత్వం 12ఎస్సి గురుకుల ఇంటర్ కళాశాలలను మూసివేసే నిర్ణయాన్ని మార్చుకోవాలని, రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తే ఆ పాఠశాల,కళాశాలల గుర్తింపు రద్దు చేసే విధంగా కఠిన చట్టం తేవాలని, ప్రతి ప్రవేట్ విద్యాసంస్థ నిబంధనలు పాటించాలని లేని పక్షంలో ఆ విద్యాసంస్థల ముందు ధర్నాలు చేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిల విడుదల పై ఇచ్చిన మాట తప్పుతున్నారని తెలిపారు. తల్లి దండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్ తీసుకున్నారని వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని అన్ని రకాల బకాయిలను విడుదల చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల చదువులకు నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం సరికాదని, వెంటనే ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయాలని అన్ని విద్యారంగ ప్రభుత్వ కళాశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వెంకటేష్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు మోరే జగదీష్, దేగాధిష్, శ్రీకాంత్ రమేష్, బన్నీ, మని, భారత్, గణేష్, సంధీప్ తదితరులు పాల్గొన్నారు.