విద్యా సంస్థల్లో బుక్స్ విక్రయిస్తున్న స్కూల్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలి.
– ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్ నాయక్.
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అనేక పాఠశాలలో పాఠశాల పక్కన ఒక గది చూసుకొని ఇష్టం వచ్చిన రీతిగా బుక్స్ అమ్ముతూ నయా దందాకు తెరలేపారని ఏఐ ఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు యజమాన్యం బుక్స్ అమ్ముతున్న వారితో కుమ్మకై అధిక ధరలకు బుక్స్ పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ దానర్జనే దేయంగా పనిచేస్తున్నాయని అన్నారు. గతం కంటే ఈ ఏడాది బుక్స్ రేట్లు రణింతలు పెరగడం గమనార్ధం, ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టి స్కూల్ సమీపంలో ఎవరైతే సెటార్లు తీసుకొని అమ్ముతున్న పాఠ్యపుస్తకాలు బుక్స్ ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే సీజ్ చేయాలన్నారు. తీసుకున్న బుక్స్ కు రసీదు కూడా ఇవ్వకుండా బుక్స్ అమ్ముతూ స్కూలు ఫీజు కంటే బుక్స్ ఫీజు ఎక్కువ ఉందన్నారు. దీనికి ఇకనైనా విద్యాశాఖ యంత్రాంగం గుర్తించి పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న స్కూల్ లపై చర్యలు తీసుకొని అమ్ముతున్న పాఠశాలల గదిని సీజ్ చేయాలని విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.