Headlines
-
గాయపడిన పేట భాస్కర్ ను పరామర్శించిన దాసర్ల శ్రీశైలం
-
తెలంగాణ ఉద్యమకారుల నేతకు సంఘీభావం తెలిపిన ఓయూ నేత
-
కోరుట్లలో డాక్టర్ పేట భాస్కర్ ను పరామర్శించిన జేఏసీ నాయకులు
-
యాక్సిడెంట్ బాధితుడికి పరామర్శ చేసి మద్దతు తెలిపిన శ్రీశైలం
-
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం
ఇటీవల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో కాలికి గాయమై ఇంట్లో విశ్రాంతి పొందుతున్న తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ను కోరుట్ల పట్టణంలోని ఆయన నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ నేత, న్యాయవాది దాసర్ల శ్రీశైలం ఆదివారం పరామర్శించారు. ప్రజాగొంతుకగా నిరంతరం ఉద్యమించే నేతకు ప్రమాదం జరగడం చాలా బాధాకరమని, ఆయన తొందరగా కోలుకోవాలని అకాంక్షించారు. ఈ సందర్భంగా మొదటిసారి తన ఇంటికి వచ్చిన శ్రీశైలంను భాస్కర్ ఘనంగా సన్మానించారు.