Site icon PRASHNA AYUDHAM

ఇందిరా గాంధీ ఆశయాల సాధనకై కార్యకర్తలు కృషి చేయాలి

IMG 20241101 WA0104

రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

భారత దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆశయాల సాధనకై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన భారత మాజీ ప్రధాని, భారతరత్న, దివంగతః ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక అయ్యప్పనగర్ లో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమావేశం నిర్వహించి దేశానికి ఆమె చేసిన అభివృద్ధిని కొనియాడారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పేదరికం నిర్ములన, హరిత విప్లవానికి నిరంతరం శ్రమించిన ఉక్కుమహిళ ఇందిరా గాంధీ* అని కొనియాడారు. గరీబీ హటావో నినాదంతో పేదరికాన్ని, అంటరానితనాన్ని రూపుమాపడానికి అహర్నిశలు పాటుపడిన మహోన్నతవ్యక్తి అని కొత్వాల అన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలకనుగుణంగా తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కొత్వాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ జెడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, అడ్వకేట్ తుమ్మల శివారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎస్ వి ఆర్ కె ఆచార్యులు, కాల్వ భాస్కర్ రావు, చింతా నాగరాజు, వై.వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, వాసుమల్ల సుందర్ రావు, ఎస్.కె చాంద్ పాషా, ధర్మసోత్ ఉపేందర్, పాబోలు నాగేశ్వరరావు, పైడిపల్లి మహేష్, కాపా శ్రీనివాసరావు, మస్నా శ్రీనివాస్, పాకలపాటి రోశయ్య చౌదరి, సందు ప్రభాకర్, యమ్మన మల్లిఖార్జున్, నక్కా నర్సింహారావు, సల్వది రత్నం, సెట్టి కమలాకర్ భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version