ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో షిండే పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినబడుతున్నాయి. అయితే, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని అజిత్ పవార్ వెల్లడించారు. పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా షిండే ఉంటారని తెలిపారు.ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. తాను ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకుడిగా నటించానని గుర్తు చేసుకున్నారు. అజిత్ పవార్ నడవడిక తనను ఆకర్షించిందని చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమం గురించి పవార్తో చర్చించిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. మరింత సమవర్థవంతంగా పని చేసేందుకే పార్టీలో చేరానన్నారు.
Latest News
