Site icon PRASHNA AYUDHAM

రద్దీ దృష్ట్యా విశాఖ గుణుపూర్ పాసింజర్ స్పెషల్ రైలుకు అదనపు కోచ్..

IMG 20241101 WA0041

రద్దీ దృష్ట్యా విశాఖ గుణుపూర్ పాసింజర్ స్పెషల్ రైలుకు అదనపు కోచ్..


ఆంధ్రప్రదేశ్ డెస్క్ శ్రీకాకుళం
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శుభవార్త తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లకు అదనపు కోచ్ లను పెంచాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు విశాఖ-గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్(08522) ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను పెంచనుంది. ఈ రైలుకు పొందూరు, దూసి, శ్రీకాకుళం రోడ్డు, కోటబొమ్మాళి, టెక్కలి, పాతపట్నం వంటి పలు స్టేషన్లలో ఆగనుంది.

Exit mobile version