సంగారెడ్డి ఆసుపత్రిని పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రశ్న ఆయుధం న్యూస్ పేపర్ లో బుధవారం ప్రచురితమైన *“సమస్యల వలయంలో సంగారెడ్డి పెద్దాసుపత్రి”* కథనాన్ని జిల్లా అధికారులు గమనించి స్పందించినట్లు తెలుస్తోంది. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాల శుభ్రత, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని త్వరితగతిన వినియోగంలోకి తేవాలని సూచించారు. వికలాంగులు సదరన్ క్యాంపు సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment