మహిళా సమాఖ్య సభ్యులచే వెదురు సాగు.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన.

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 11 భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మన రాష్ట్రంలోని 5 జిల్లాల లో ( భద్రాద్రి కొత్తగూడెం,ములుగు, జయశంకర్ ,భూపాలపల్లి, అదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ ) జిల్లాకు వెయ్యి మంది చొప్పున 5000 మంది మహిళా సమాఖ్య సభ్యులచే వెదురు సాగు ప్రయోగాత్మకంగా చేపట్టుటకు గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్ణయించడం జరిగిందని స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో రెండవ రోజు ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వెదురు సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని చుండ్రుగొండ, ములకలపల్లి మరియు గుండాల మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు క్రింద తీసుకోవడం జరిగిందని ఈ మండలాల్లోని 1000 మంది మహిళా సమాఖ్య సభ్యులను గుర్తించి వారికి వెదురు సాగు పై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వీరికి ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు సరఫరా మరియు నిర్వహణ కొరకు నిధులు సమకూర్చడం జరుగుతుంది ఆమె తెలిపారు. వెదురు మొక్కలు నాటిన తర్వాత నాలుగు సంవత్సరాలకు దిగుబడి ప్రారంభమవుతుందని, అప్పటి నుండి 80 సంవత్సరముల వరకు ప్రతి సంవత్సరం వెదురు దిగుబడి అమ్మడం ద్వారా రైతు ఆదాయం గడించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ మరియు మార్కెటింగ్ కు సంబంధించి సెర్ప్ మరియు ఇండస్ట్రీ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ నీలేష్, మూడు మండలాల డీపీఎంలు, ఏ పీ ఎం లు, సీసీలు, ఏపీవోలు, ఎఫ్ పి ఓ లు, బి ఓ డి లు, ఉద్యానవన శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ అధికారులు రమ్య, శ్రీకాంత్, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now