*అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ హుజురాబాద్ కు మంజూరు*
*విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యయనం-ఫలించిన ప్రణవ్ కృషి*.
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపిన ప్రణవ్*
*హుజురాబాద్ జూన్ 20 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం ఏటిసి(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తమ ప్రభుత్వం విద్యారంగంపై అధిక దృష్టి వహిస్తుందని, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనీ యువతీ,యువకులకు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయడానికి,ఉద్యోగ కల్పనకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.గతంలో ఎన్నికల సమయంలో యువత భవిష్యత్ కు సంబంధించి దృష్టిసారిస్తానని నిరుద్యోగ యువతి,యువకులకు అండగా ఉంటానని తెలిపారు