*అఖిల భారత విద్యార్థి ఏ ఐ ఎస్ ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం*
*భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్*
*ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 12*
అఖిల భారత విద్యార్థి ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు హాజరై జెండాను ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకపూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ల ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు12 న ఏ ఐ ఎస్ ఎఫ్ ఆవిర్భవించిందని విష్ణు పేర్కొన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని భరత మాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవకిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం ఏ ఐ ఎస్ ఎఫ్ పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై శాస్త్రీయ విద్య కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 89సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడుతాం చదువుకై_పోరాడుతాం అంటూ తెలంగాణ రైతాంగ పోరాటంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం 18సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం మలిదశ తెలంగాణ పోరాటంలో
హాస్టళ్ల సమస్యలపై, విద్య_వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది ఏఐఎస్ఎఫ్ అన్నారు శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా ప్రభుత్వ విద్యను సెక్యులరిజాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని సమరశీల విద్యార్థి ఉద్యమాలు నిర్వహించిందని ఇకపై కూడా నిర్వహించబోతుందని తెలియజేశారుఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్ , పవణ్, ప్రదీప్, శ్రీవల్లి, మనిష, రమ్యా, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.