Site icon PRASHNA AYUDHAM

వేలాది మందికి నాణ్యమైన ఆహారం అందిస్తున్న అక్షయపాత్ర కృషి ప్రశంసనీయం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

IMG 20251025 150047

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన మహా నరసింహా హోమము, గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ… ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ లో శ్రీ శ్రీ రాధా కృష్ణ విగ్రహాలను ప్రతిష్టించి సనాతన ధర్మ మహోన్నత సంస్కృతిక వారసత్వాన్ని, విలువలను ప్రాచుర్యంలోకి తేవటానికి అద్భుత అధ్యాత్మిక సంస్కృత కేంద్రంగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్బంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆద్వర్యంలో 3 కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనర్సింహా టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్ ను పరిశీలించారు. ఆధునిక వంట గదులను, స్నాక్స్, ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్,, కటింగ్ మెషిన్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version