Headlines:
-
“అకుల రాజేందర్: భోగి, దీపావళికి సెలవులు ప్రకటించాలి”
-
“హిందూ ఉత్సవ సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి”
-
“పండుగల ప్రాధాన్యతను గుర్తించాలని రాజేందర్ కోరారు”
-
“భోగి, దీపావళి పండుగలకు ప్రత్యేకమైన సెలవులు అవసరం”
*హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్*
*జమ్మికుంట అక్టోబర్ 29 ప్రశ్న ఆయుధం:-*
రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను హిందువుల పండుగల ప్రాధాన్యత ప్రాసస్యాన్ని గుర్తించి దీపావళికి
31వ రోజున భోగి1వ రోజున దీపావళి రెండు రోజులు సెలవులు ప్రకటించాలని ఇందు ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదివరకు ప్రకటించిన ఒక్క రోజు సెలవు 31వ గురువారం భోగి నాడు ఇచ్చారని కానీ హిందువులు దీపావళి పండుగ రోజు ధనలక్ష్మి పూజ, కేదారేశ్వర స్వామి వ్రతం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 31న, నవంబర్ 01న గురు, శుక్రవారం రోజులలో హిందువులు పవిత్రంగా జరుపుకునే కేదారేశ్వర నోములకు దీపావళి పండుగ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని హిందువుల మనోభావాలను గుర్తించి సెలవును మార్పు చేసి ఇవ్వవలసిందిగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.