కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్!
తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే!!
కొత్త రేషన్కార్డుదారలు ఈ-కేవైసీ చేసుకోవాలంటున్న అధికారులు
సమీపంలో రేషన్షాప్నకు వెళ్లి వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలని సూచన
బినామీలకు చెక్ పెట్టేందుకే ఈకేవైసీ నిబంధన
* ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసిన సంగతి తెలిసిందే
* కార్డులు పొందిన వారు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు
* కొత్త రేషన్ కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలను (ఫింగర్ ప్రింట్లను) అప్డేట్ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు
* ప్రతి ఒక్కరు ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాలని గత రెండేళ్ల నుంచి సర్కారు పలుమార్లు పేర్కొంది
* గడువు పెంచుకుంటూ వెళ్తోంది
* కామారెడ్డి జిల్లాలో 26,521 కొత్త రేషన్కార్డులు మంజూరయ్యాయి
* వారికి సెప్టెంబరు నెలలో కోటా బియ్యం కూడా విడుదల చేశారు
* 40 వేల మంది కుటుంబ సభ్యులకు సంబంధించి పేర్లను పాత కార్డుల్లో జమ చేశారు వీరు కూడా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది
అందుకే కేవైసీ నిబంధన
* జిల్లాలో ప్రస్తుతం 2,83,253 రేషన్కార్డులు ఉండగా అందులో 86 శాతం మంది ఈ-కేవైసీ చేయించుకున్నారు
* మిగతా కార్డుదారులు త్వరగా చేయించుకోవాల్సి ఉంటుంది
* ఈ-కేవైసీ చేయించుకోని వారికి బియ్యం బంద్ చేస్తామని కేంద్రం గతంలో పేర్కొంది
* ఎందుకంటే ఆధార్కు ఈ-పాస్ యంత్రానికి అనుసంధానం చేయడం వల్ల బినామీలు బియ్యం తీసుకోవడానికి వీలుండదు. అందుకే కేవైసీ నిబంధన విధించారు
నవీకరణ లేకపోవడంతో ఆలస్యం
* ఆధార్ అప్డేట్ లేకపోవడం వల్ల కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి
* వీరు ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేషన్ ప్రక్రియను పూర్తి చేయించుకున్నప్పటికీ ఈ-కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు
* ఇదేంటని ఇతర ఆధార్ కేంద్రాలకు వెళ్లి తెలుసుకుంటే ఆధార్ నవీకరణ పూర్తి కాకపోవడం వల్ల ఈ-కేవైసీ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు
* దీంతో లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు
* ఆధార్ నవీకరణ పూర్తికాకపోవడం వల్ల చిన్నారులు ఈ-కేవైసీకి దూరమవుతున్నారు
ఆధార్ కేంద్రాలు తక్కువ
* కామారెడ్డి జిల్లాలో ఆధార్ కేంద్రాలు తక్కువ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
* దీంతో ఆధార్ సెంటర్లు లేని మండలాల ప్రజలు ఇతర మండలాలకు వెళుతున్నారు
* అధికారులు స్పందించి కనీసం మండలానికి ఒక ఆధార్ కేంద్రాన్ని అయినా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు
* గడిచిన ఏడాదిగా జిల్లాలో ఐదారు ఆధార్ కేంద్రాల సర్వీసులను నిలిపివేశారు
* జిల్లాలో 25 మండలాలు ఉండగా 10 ఆధార్ సెంటర్లు మాత్రమే కొనసాగుతున్నాయి
* మిగతా మండలాల్లో మాత్రం ఆధార్ కేంద్రాలు లేవు
* ఈ విషయమై డీఎస్వో మల్లికార్జున్బాబు మాట్లాడుతూ.. కొత్తకార్డుదారులు ఈ-కేవైసీ చేయించుకుంటే వారికే మంచిదని వివరించారు
* రేషన్ కేంద్రాల్లో చాలా మందికి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తికావడం లేదు
* దీనికి రేషన్కార్డుదారులు ఆధార్ నవీనీకరణ (అప్డేట్) చేసుకోకపోవడమే కారణమని డీలర్లు చెబుతున్నారు
* దీంతో ప్రజలు ఆధార్ కేంద్రాలకు అప్డేట్ కోసం పరుగులు తీస్తున్నారు
* అయితే ఆధార్ కేంద్రాలు తగినన్ని లేకపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు
* చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఇటు రేషన్ కేంద్రాల చుట్టూ అటు ఆధార్ కేంద్రాల చుట్టూ అప్డేట్ కోసం తిరుగుతున్నారు