ఉద్యోగుల జేఏసీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ గా అమరనేని రామారావు కన్వీనర్

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చ్ 26 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo ఉద్యోగుల జేఏసీగా ఏర్పడి చైర్మన్గా అమర్ నేని రామారావు, వెంకట పుల్లయ్య నియమితులయ్యారు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక పెన్షనర్ల భవనం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల జేఏసీ(టీజీ ఈ జె ఈ సి) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ గా అమరనేని రామారావు కన్వీనర్ గా సంఘం వెంకట పుల్లయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య భద్రత, పెండింగ్ పిఆర్సి, పెండింగ్లో ఉన్న 5డి.ఎలు, ఆర్ధిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న బకాయిలను మంజూరు చేపించడంకోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షర్ల సంఘాల జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now