అమరుడు జవాన్ మురళి నాయక్ కు వందనం
ప్రశ్న ఆయుధం మే10: శేరిలింగంపల్లి ప్రతినిధి
జమ్మూ కాశ్మీర్లో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన యువతేజం మురళి నాయక్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు మియాపూర్ డివిజన్ లో ఆపరేషన్ సింధూర్ ర్యాలీకి సంఘీభావం తెలిపిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లో 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని రవి కుమార్ యాదవ్ ప్రశంసించారు.
పాకిస్తాన్ మనదేశంలోని ఎయిర్ పోర్టులను టార్గెట్ చేసుకొని చేసిన దాడులను భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని తెలుపుతూ,
ఆపరేషన్ సింధుకు సంఘీభావంగా మియాపూర్ బొల్లారం చౌరస్తా నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు
ఈ సందర్భంగా భారత ఆర్మీకి బలం చేకూర్చే విధంగా కులాలకు, మతాలకు ,అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై తమ మద్దతు తెలపాలని తెలిపారు అంతేకాకుండా పోరాటంలో భారత ఆర్మీ గెలవాలని అన్ని డివిజన్లో పూజలు ,అర్చనలు, ప్రార్థనలు చేసి భారత ఆర్మీకి ఆ భగవంతుని అండదండలు పుష్కలంగా ఉండే విధంగా మనమంతా మద్దతు ప్రకటించాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొదలగు వారు పాల్గొన్నారు.