అమెజాన్ కంపెనీ హైదరా బాద్లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిం చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమ య్యారు. తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ కార్యకలాపా లపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యక లాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరా బాద్లో ఉంది. గత ఏడాది అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ అమెజాన్ ఎయిర్ ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్కు సంబం ధించి హైదారాబాద్లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు తమ వ్యాపారాన్నివిస్తరించే ఆలో చనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.అమెజాన్తో చర్చలు విజయవంతమయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటిం చారు. ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సా హకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ డేటా సెంటర్ విస్తరణకు కంపెనీ మందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు..