Site icon PRASHNA AYUDHAM

అంబేద్కర్ ని అవహేళన చేస్తే ఎవరినైనా ఉపేక్షించం

IMG 20241222 WA0174

మాదిగ ఐక్యవేదిక
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 22 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.పీడిత ప్రజలకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛను కల్పించింది అంబేద్కర్ మాత్రమే అన్నారు. మాది ఐక్యవేదిక సుజాతనగర్ మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ పేరును ఉచ్చరించే వాళ్లను హేళన చేయడం అవమానించడమేనని ఖండించారు.దేశ హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయనను పార్లమెంట్ సభ్యత్వం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుజాతనగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చిత్రపటాలతో నిరసన తెలిపారు అమిత్ షా డౌన్ డౌన్ అంటూ జై భీమ్ నినాదాలు మోగించారు. వేల్పుల మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా పదవి పొంది పార్లమెంటులో ఆ మహనీయుని అవహేళన చేస్తూ అమిత్ షా మాట్లాడటం సరైనది కాదని ,ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహ వద్ద దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ,దళిత పీడిత ప్రజలు వేల సంవత్సరాలు బానిసలుగా అంటరాని వారిగా దుర్భర జీవితాలు గడిపారని ,ఆ జీవితాలకు వెలుగును అందించింది ఒక్క అంబేద్కర్ మాత్రమేనని, అలాంటి మహనీయుని అవమానపరిస్తే ఊరుకోబోమని అన్నారు ,ఐక్యవేదిక మండల కార్యదర్శి గుండేటి వెంకట రాములు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడిన బిజెపి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నదని, ఆరాజ్యాంగాన్ని ఒక దళితుడు రాశాడన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని, అమిత్ షా పై పార్లమెంటులో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, ఐక్యవేదిక ఉపాధ్యక్షులు కత్తి బాలకృష్ణ మాట్లాడుతూ దేశ హోం మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ ని విమర్శించటం సరికాదని ఉద్దేశపూర్వకంగానే ఆయనను అవహేళన చేస్తున్నారని, పైకి ప్రేమ కనబరుస్తూ లోపల రాజ్యాంగం పై కుట్ర పన్నుతున్నారని ఓటు హక్కు ద్వారా వారు పదవులు పొందినది రాజ్యాంగం ద్వారా కాదా అని ప్రశ్నించారు ,అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ రక్షణే తమ ధ్యేయమని ,దానికి భంగం కల్పిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని, అమిత్ షా ను తన పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక గౌరవ సలహాదారులు కత్తి వెంకన్న, మురిపిటి రాములు ,సిరిగిరి మురళి, కాకటి బాబు ,కొండ్రు వెంకటేశ్వర్లు” సంయుక్త కార్యదర్శి సిరిగిరి రవి, కోశాధికారి మురిపిటి మాధవరావు, సహాయ కార్యదర్శి గుండేటి ఆదినారాయణ ప్రత్యేక ఆహ్వానితులు మందరాజు, గుండేటి రాములు ,గుండేటి గోపయ్య, కాకటి నరసింహారావు, గుండేటి బాలకృష్ణ,పసుపులేటి నాగేశ్వరరావు “కమిటీ సభ్యులు తోకలవెంకటేశ్వర్లు, వేల్పుల రాజు, కత్తి వేణు పసుపులేటి తిరుపతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version