ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలిని సన్మానించిన ఏఎంసీ డైరెక్టర్..
కామారెడ్డి జిల్లా దోమకొండ
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 11:
దోమకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని శుక్రవారం భిక్కనూరు ఏఎంసీ డైరెక్టర్ కదిరే గోపాల్ రెడ్డి సన్మానించారు. తనపై నమ్మకంతో ఏఎంసీ డైరెక్టర్ నియామకం చేసినందుకుగాను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జైరాబాద్ పార్లమెంట్ యువ నాయకులు ఇలియాస్ బాయ్ కదిరే గోపాల్ రెడ్డి ని సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిర్మల్ గౌడ్, కాంగ్రెస్ దోమకొండ అధ్యక్షుడు సీతారాం మధు, నాయకులు సాయబ్ గారి రాజు, అబ్రబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.