దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

*దేవీ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు*

*కుమారి పూజ నిర్వహించిన ఠాగూర్ కుటుంబస్తులు*

 

జమ్మికుంట ప్రశ్న ఆయుధం అక్టోబర్ 10*మ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్ లోని 24 వ వార్డు నందు రాజేష్ ఠాకూర్ రాకేష్ ఠాగూర్ అన్నదమ్ముల ఆధ్వర్యంలో కన్య (కుమారి)పూజ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారు ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా భ‌క్తుల‌కు దర్శనమిచ్చిందని దేవి అమ్మవారిగా భావించి అని తలవగానే మన మదిలో త్రిశూలధారియై దుర్గాష్టమి నాడే 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పూజ చేసి, తాంబూలాలు, కానుకలు అందజేసి కన్యా పూజ నిర్వహించారు బాలికల్లో దుర్గాదేవి కొలువై ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని అందుకే తొమ్మిది మంది బాలికలను ఇంటికి పిలిచి వారిని పూజించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు పొందినట్టుగా భావిస్తున్నామని తెలిపారు పూజ చేసిన తర్వాత ఖీర్ సమర్పించి దక్షిణ తాంబూలం అందించారు బొమ్మల కొలువు పేరంటం కొనసాగిస్తారని తెలిపారు అనంతరం మహిళలు బతుకమ్మ పాటలతో కోలాటాలతో దాండియా ఆటపాటలు కొనసాగించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్, జమ్మికుంట పట్టణ కార్యదర్శి రాకేష్ ఠాగూర్ భక్తులు కుటుంబ సభ్యులు బంధువులు వార్డు సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now