మెదక్/నర్సాపూర్, అక్టోబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ శివాలయంలో నవరాత్రులలో భాగంగా 9వ రోజు శ్రీ మహిషా సురమర్థిని అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శుక్రవారం శివాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆలయం వద్ద హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి వీరప్ప, భక్తులు పాల్గొన్నారు.