అమృత సరోవర్ పథకం ద్వారా గ్రామాల్లో చెరువుల అభివృద్ధి
ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 19( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు
పార్వతీపురం
నియోజకవర్గంలోని ఉన్న అన్ని గ్రామాల్లో కల చెరువులను ఉపాధి హామీ అమృత సరోవర్ పథకం ద్వారా అభివృద్ధి చేసి సుందరీ కరణ చేపడతామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామం ప్రధాన రహదారి కి ఆనుకుని ఉన్న కోనేటిలో అమృత సరోవర్ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాలలో యువత వ్యాయామం చేసుకోవడానికి వృద్ధులు నడకకు, చిన్నపిల్లలకు ఆట స్థలాలుగా వినియోగించుకోవచ్చని, అంతేకాకుండా చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఉపాధి హామీ అమృత సరోవర్ పథకం ద్వారా నియోజకవర్గంలోని బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాలకు చెందిన పలువు చెరువులను అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.