లబ్ధిదారులకు ఆర్డర్ కాపీ అందజేసిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల అధ్యక్షుడు అనంతరెడ్డి..
దోమకొండ మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పంచాయతీ కార్యదర్శి ఆర్డర్ కాపీ అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, మండల అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం మొదటి విడతలో అధికారులు అందజేసిన లిస్టులో వచ్చిన పేర్ల ప్రకారం ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచన మేరకు పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ మంజూరు చేస్తామని షబ్బీర్ అలీ తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు గోపాల్ రెడ్డి, శమీ, నయీమ్, రాములు, బాలరాజు, నర్సింలు, పంచాయతీ కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు