Headlines :
-
అనంతపురం జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-
ఎస్పీ జగదీష్ 100 పిటీషన్లపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు
-
కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలపై ప్రజల ఫిర్యాదులు
అనంతపురం :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు వచ్చిన పిటీషనర్లకు చట్టపరిధిలో న్యాయం చేయండి
జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపీఎస్
జిల్లా పోలీసు కార్యాలయం ” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కు 100 పిటీషన్లు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( PGRS)కు వచ్చిన పిటీషనర్లకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపీఎస్ ఆదేశించారు.
స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” ( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రస్సల్ సిస్టం ) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ
జిల్లా నలమూలల నుండీ వచ్చిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ…
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు మహిళా డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.