పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు
సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేటలో దుర్గాష్టమి సందర్భంగా మహంకాళి మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు హాజరయ్యారు. సదాశివపేట పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో నిర్వహించిన దేవి నవరాత్రులను పురస్కరించుకుని చివరి అవతారమైన దుర్గాదేవి ప్రత్యేక పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతఃకాల సమయంలో అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, పుష్పాలంకరణను ఆలయ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఈ ఆలయం చాలా పురాతనమైనదని, అమ్మవారు భక్తులకు ఎల్లవేళలా కోరిన కోరికలను తీరుస్తున్నదని, ప్రతి సంవత్సరం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి నవరాత్రులను నిర్వహిస్తూ ప్రతిరోజు సాయంకాలం పూజా అనంతరం ఆలయంలో భక్తులు భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు. నవరాత్రులలో చివరి రోజైనా దుర్గామాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారన్నారు. పులి మామిడి రాజు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి భక్తులందరికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నల్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నల్ల శంకర్, సహాయ కార్యదర్శి చాపల హనుమంతు, కార్యదర్శులు నల్ల మల్లేశం, సాయి కిరణ్, ప్రవీణ్, నరేందర్, మహేష్, వినోద్, మనోహర్, శశి, వార్డు కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, ఓదెల రాజేశ్వరి మాణిక్ రావు, గుండు రవి, బామిని రవి, నెమలి కొండ వేణు మాధవ్, చిల్వెరి మహేష్, పీ.ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము, ఆనంద్, అఖిల్, మనోజ్, నాగరాజు, సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు.