Site icon PRASHNA AYUDHAM

వర్షాలకోసం 11కోట్ల లిఖిత రామ నామాలతో అభిషేకం

IMG 20250623 182556

Oplus_0

*సీతారాములకు 11కోట్ల 11లక్షల 11వేల నామాలతో అభిషేకం*

*నిర్వహించిన అధ్యక్షుడు రామకోటి రామరాజు*

మెదక్/గజ్వేల్, జూన్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రతి రైతు ఆనందంగా ఉండాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద సోమవారం భక్తులు లిఖించిన 11కోట్ల11లక్షల11వేల లిఖిత అమృత శ్రీరామ నామాలతో సీతారాములకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ప్రత్యేకంగా అభిషేకించి పూజించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసినట్లయితే పంటలు పండుతాయన్నారు. దీని ఆధారంగా వ్యవసాయం ముందుకు సాగుతుందన్నారు. దేశానికి రైతే వెన్నుముఖ అని, అలాంటి రైతు సుఖంగా జీవించకుంటే పరిపాలన కూడా అస్తవ్యస్తంగా మారుతుందన్నారు.

Exit mobile version