సామాన్య ప్రజలపై మరో భారం..డిప్యూటీ సీఎం డీకే.

సామాన్య ప్రజలపై మరో భారం..

రోక్షంగా చెప్పిన డిప్యూటీ సీఎం డీకే..

 వాటర్‌ బోర్డు నష్టాల్లో ఉందని ప్రకటన..

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనుంది.

IMG 20240823 WA0038

బెంగళూరులో నల్లా బిల్లులు పెంచాలని సిద్ధరామయ్య సర్కారు భావిస్తున్నది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమార్‌ పరోక్షంగా వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నల్లా బిల్లులు పెంచాలనే ప్రతిపాదన ఏడెనిమిది ఏండ్ల నుంచి ఉంది. వాటర్‌ బోర్డు(బీడబ్యూఎస్‌ఎస్‌బీ) నష్టాలతో నడుస్తున్నది. కరెంటు బిల్లులు కట్టడానికి కూడా పైసలు లేవు.పనులు ఎలా చేయాలి? వేరే మార్గం లేదు. క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం వరుసగా ప్రజలపై ఏదో ఓ భారం వేస్తూ వస్తున్నది. రెండు నెలల క్రితమే కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) పాల ధరలను లీటరుకు రూ.2 పెంచింది. ఏడాదిలో ధరలు పెంచడం ఇది రెండోసారి. ఆ తర్వాత పెట్రో ధరలపై సేల్స్‌ ట్యాక్స్‌ను పెంచింది. దీంతో పెట్రోల్‌ ధర రూ.3, డీజిల్‌ ధర రూ.3.02 పెరిగింది. ఇప్పుడు బెంగళూరు వాసుల నల్లా బిల్లులు పెంచేందుకు సిద్ధమైంది.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు గ్యారెంటీల ప్రచారంతో కాంగ్రెస్‌ ఊదరగొట్టింది. ఆ గ్యారెంటీలను అమలు చేయాలంటే వేలాది కోట్ల రూపాయలు అవసరం. అయితే నిధుల అందుబాటును పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా హామీలిచ్చేసిన కాంగ్రెస్‌.. అధికారం చేపట్టిన తర్వాత ఆయా గ్యారెంటీలకు ఆంక్షలు, కోతలతో ఎగనామం పెడుతున్నది. ‘ఉచిత విద్యుత్తు’ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారని, మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు కొత్త ఆంక్షలు జోడించారని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్‌లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.అవసరమనుకుంటే ఆ లేఖపై విచారణ.. ముడా స్కామ్‌పై కర్ణాటక హోంమంత్రిసీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి 2014లో ‘మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ (ముడా)కి రాసిన లేఖను ట్యాంపరింగ్‌ చేశారని, అందులోని కొన్ని వ్యాఖ్యల్ని వైట్‌నర్‌తో చెరిపివేశారన్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై అవసరమనుకుంటే, సిట్‌ లేదా దర్యాప్తు సంస్థ దృష్టిసారిస్తుందని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చెప్పారు. అత్యంత ఖరీదైన విద్యానగర్‌ లే-అవుట్‌లో తనకు భూమి ఇవ్వాలని బీఎం పార్వతి ఆ లేఖలో కోరారు.అయితే, దీనిని వైట్‌నర్‌తో ఉద్దేశపూర్వకంగా కొట్టివేశారు. ముడా కుంభకోణం బయటపడ్డాకనే ఆధారాలు చెరిపేయాలనే లక్ష్యంతోనే ఇలా కొట్టేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలేంటో నాకు తెలియదు. కానీ, సీఎం భార్య రాసిన లేఖలోని అంశాలపై అవసరమనుకుంటే దర్యాప్తు సంస్థ దృష్టి సారిస్తుంది’ అని చెప్పారు.అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్‌ గురువారం లోకాయుక్త పోలీస్‌ ముంగిట హాజరయ్యారు. కేసుకు సంబంధించి మూడు గంటలపాటు ఆయన్ని లోకాయుక్త అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. రాష్ట్ర మంత్రిగా డీకే 2013-18 మధ్య పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఆర్జించారని సీబీఐ 2020 సెప్టెంబర్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక, కేసును సీబీఐ నుంచి లోకాయుక్తకు బదిలీ చేసింది.సీబీఐ విచారణను నిరాకరించింది. అయినప్పటికీ కేసు దర్యాప్తు సీబీఐ ఆపటం లేదని డీకే శివకుమార్‌ మండిపడ్డారు. ‘సీబీఐ ఈ కేసును విచారించటం ఆపాలి. కానీ అలా చేయటం లేదు. నన్ను, నా వాళ్లను సీబీఐ వేధిస్తున్నది. నాకు సమన్లు ఇవ్వకుండా, నన్ను విచారణ చేయకుండా, నా బంధువులు, స్నేహితుల్ని వేధిస్తున్నది. లోకాయుక్త కూడా అదే చేస్తున్నది’ అని డీకే అన్నారు.

Join WhatsApp

Join Now