ఏపీలో మరో భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్లతో ఆసియాలోనే పెద్దది, ఆ జిల్లాకు జాక్‌పాట్

ఏపీలో మరో భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్లతో ఆసియాలోనే పెద్దది, ఆ జిల్లాకు జాక్‌పాట్

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీలు, పెట్టుబడులు, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల్లో వేగం పుంజుకుంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు, శంకుస్థాపనలతో కొత్త ఉత్తేజం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నారు. రూ.10 వేల కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్‌ పెట్టడానికి రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ భారీ ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు.. రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ సంస్థ ప్రతినిధులు భూములను కూడా పరిశీలించడం గమనార్హం.ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుండగా.. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 930 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్‌తో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేయడానికి రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌ సిద్ధం అయింది. ఇటీవల కర్నూలు జిల్లాలో రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ ప్రతినిధులు రెండు స్థలాలను పరిశీలించారు. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.అయితే ఈ అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా నిర్మాణ దశలోనే వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపాయి. సెకితో కలిసి రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్‌ చేపట్టే ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలోనే ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 25 ఏళ్ల కాలానికి విద్యుత్ కొనుగోలు చేసేలా సెకి ఒప్పందం చేసుకోనుంది. ఈ రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్‌ కర్నూలులో ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను దేశంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలకు సరఫరా చేయనున్నారు. బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ -బీఓటీ విధానంలో ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.

Join WhatsApp

Join Now