విజయసాయిరెడ్డి విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ పోలీసుల నోటీసులు..

విజయసాయిరెడ్డి విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ పోలీసుల నోటీసులు..

బుధవారం ఉ.11 గంటలకు విచారణకు రావాలని ఆదేశం. విజయవాడ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశం.

కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితోపాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1 విక్రాంత్ రెడ్డి, ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ-3 శరత్ చంద్రారెడ్డి, ఏ-4 శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా ఉన్నారు.

మరోవైపు ఇదే కేసులో ఈడీ ఎదుట విచారణకు సైతం సాయిరెడ్డి హాజరయ్యారు. తాజాగా ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ అధికారులు ప్రస్తావించారు. మాజీ ఎంపీ సాయిరెడ్డికి సీఐడీ ఎస్పీ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి ఇప్పటివరకు ఈ కేసు విషయంలో కోర్టుకు వెళ్లలేదు. అయితే ఆయన ముందస్తు బెయిల్‌ దాఖలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment