తెలంగాణలో రిపోర్టు చేసిన ఏపీ ఐఏఎస్లు…
ఏపీ ఐఏఎస్లు సృజన, శివశంకర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్ట్ చేశారు. తెలంగాణలో రిపోర్ట్ చేయాల్సిందిగా వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్లు ఏపీకి వెళ్లనున్నారు. ఐపీఎస్లకు కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో అంజనీ కుమార్, అభిలాష బిస్త్ TGలోనే కొనసాగనున్నారు.*