ఐకేపీ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏపిఎం రమాదేవి

*ఐకేపీ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏపిఎం రమాదేవి*

*ఇల్లందకుంట ఏప్రిల్ 20 ప్రశ్న ఆయుధం*

IMG 20250420 WA2925

జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో మర్రివానిపల్లి, గడ్డివానిపల్లి, టేకుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇల్లందకుంట ఏపిఎం రమాదేవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం రమాదేవి మాట్లాడుతూ మర్రివానిపల్లి అరుణోదయ గ్రామ సంఘం, గడ్డివానిపల్లి వీరాంజనేయ గ్రామ సంఘం, టేకుర్తి అంజలి గ్రామ సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని రైతులు ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని సన్న వారికి బోనస్ కూడా ఇస్తుందని రైతులు పంట కోసిన తర్వాత ఆరబెట్టి తాలు లేకుండా ఐకెపి కేంద్రం తీసుకువచ్చి వరి ధాన్యం అమ్ముకొని మద్దతు ధరల పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కళ్ళెం సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్ వేముల జైపాల్ రెడ్డి ,మాజీ సర్పంచ్ కళ్లెం రాజిరెడ్డి, సంఘం అధ్యక్షురాలు శ్రీలత, అనూష, మమత, వివో ఏలు సరోజన , అరుణ, సుజాత, సీసీలు జనార్ధన్ రమేష్ సుమలతతో పాటు రైతులు అమాలి కార్మికులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now