Site icon PRASHNA AYUDHAM

దరఖాస్తులకు ఆహ్వానం జిల్లా కలెక్టర్..

IMG 20241026 165233

దరఖాస్తులకు ఆహ్వానం జిల్లా కలెక్టర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 26:

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ బిచ్కుంద, కామారెడ్డి జిల్లా యందు ఈ విద్యా సంవత్సరంలో ఐటిఐలో ఆరు కొత్త కోర్సులు ప్రారంభించడం జరిగిందని, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 తేదీలోగా ఆన్ లైన్ లో తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. అట్టి ఐ.టీ. ఐ.లో కొత్తగా ఆరు ట్రేడ్ లు ప్రారంభించడం జరిగినదని,
1. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ – 1 సంవత్సరం (40 సీట్లు)
2. ఇండస్ట్రీ రోబోటిక్స్ & డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ – 1 సంవత్సరం (40 సీట్లు)
3. ఆర్టిసన్ యుజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టూల్స్ – 1 సంవత్సరం (40 సీట్లు)
4. బేసిక్ డిజైనర్ & వర్చ్యువల్ వెరిఫైర్ (మెకానికల్) – 2 సంవత్సరాలు (24 సీట్లు)
5. అడ్వాన్స్డ్ సి ఎన్ సి మిషనింగ్ టెక్నీషియన్ – 2 సంవత్సరాలు (24 సీట్లు)
6. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ – 2 సంవత్సరాలు (24 సీట్లు)
ఆ ప్రకటనలో తెలిపారు.
అడ్మిషన్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికేట్లు (ఏస్.ఏస్. సీ మెమో, టి సి, బోనఫైడ్. క్యాస్ట్ కాల్) మరియు 4 జిరాక్స్ కాపీలతో 30-10-2024లోపు ప్రభుత్వ ఐటిఐ బిచ్కుందలో హాజరుకావాలని తెలిపారు.
అభ్యర్థులు ఎస్.ఎస్.సి. పాస్ అయి ఉండాలి.
కోర్సు ప్రత్యేకతలు: టాటా వారు ఆధునాతన యంత్రాలు అందించి, కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9866757695 / 9640228856 సెల్ ఫోన్ ల ద్వారా సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Exit mobile version