*భూభారతి రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలి*
*మండల తాసిల్దార్ పి రాణి*
*జమ్మికుంట/ఇల్లందకుంట జూన్ 17 ప్రశ్న ఆయుధం*
భూ సమస్యలు ఉంటే రైతులు నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకొని పరిష్కరించుకోవాలని మండల తాసిల్దార్ పి రాణి ఇల్లందకుంట రెవెన్యూ సర్వీసులో తెలిపారు భూభారతి రెవెన్యూ సదస్సులో పొందుపరిచిన అంశాలను ఆధారంగా చేసుకుని పరిష్కరించబడతాయని తాసిల్దార్ తెలిపారు భూభారతి ఆర్ వో ఆర్ చట్టాన్ని అనుసరించి సమస్యలను మోకా ఎంక్వయిరీ తో పరిష్కారం చూపబడుతుందని పేర్కొన్నారు మంగళవారం రోజు జరిగిన రెవిన్యూ సదస్సులో ముత్యం 124 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ పి రాణి డిప్యూటీ తాసిల్దార్ మన్విత్ సింగ్ ఆర్ ఐ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఇతర రెవిన్యూ సిబ్బంది రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు