ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అశ్వాపురం మండల కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్ సి హెచ్ పి ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొని అశ్వాపురం మండల కమిటీని కమిటీ అందరి ఆమోదంతో ప్రకటించారు. అశ్వాపురం మండల కమిటీ కన్వీనర్ చీకటి నవీన్,కో కన్వీనర్ తగిర్ష గణేష్, సహాయ కన్వీనర్ కత్తి కృష్ణ కమిటీ సభ్యులు కోరగట్ల శివాజీ, గద్దల లంకేష్, కోరగట్ల లోకేష్, ఎన్న కౌశిక్, గద్దల అరవింద్, ఎన్న సంగీతరావు, బాసి పోగు రాజశేఖర్ కగా గౌరవ సలహాదారులుగా ఇరుగు రాజు, బేతం దేవరాజులను నియమించడం జరిగిoది ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలు ఎదుర్కొంటున్న స్థానిక రిజర్వేషన్ జడ్పిటిసి,ఎంపీటీసీ ఉద్యోగ, ఉపాధి ఎస్సీ రైతుల సాగు భూములకు, పోడు భూములకు నివసించడానికి ఇల్లు కట్టుకున్న పూరి గుడిసెకు కరెంట్ మీటర్ వంటి అభివృద్ధి పథకాలకు ఆంక్షలు విధించి రాజ్యాంగ హక్కులను ఎస్సీ కులాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దూరం చేస్తున్నాయని హక్కుల సాధించడానికి ఐక్యంగా పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎనగంటి కృపాకర్,ఇనుముల వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా సంగం కన్వీనర్ నీలం పార్వతి, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ కులాల అశ్వాపురం మండల కమిటీ నియామకం
by Naddi Sai
Published On: November 22, 2024 6:47 pm
