సమస్యల పరిష్కారం కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా లో   ఏపీటీఎఫ్ ధర్నా 

సమస్యల పరిష్కారం కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా లో

ఏపీటీఎఫ్ ధర్నా

పార్వతిపురం మనం జిల్లా ప్రతినిధి మే 9 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఒక ప్రయోగశాలగా మారిందని, పాలకులు ఎవరైనా పాఠశాలలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా విఫల ప్రయోగాలు చేపడుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణారావు విమర్శించారు. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అశాస్త్రీయమైన తొమ్మిది రకాల పాఠశాలలను బలవంతంగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘ పిలుపుమేరకు రెండవ దశ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా శాఖ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఒకటి నుండి ఐదు తరగతులతో కూడిన మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని, తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున నియమించాలని, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 55 ప్రకారం ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ మంజూరు చేయాలని, ఆ తరువాత ప్రతి 35 మందికి ఒక్కొక్కరు చొప్పున పాఠశాల సహాయకులను నియమించాలని , పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పాఠశాల స్కూల్ అసిస్టెంట్లు నియమించాలని, ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియంని తప్పనిసరిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను చేపట్టారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన మూడు డి.ఏ.లు గత పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలని నూతన పే రివిజన్ కమిటీని నియమించి కనీసం 30 శాతానికి తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా శిబిరంలో వివిధ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా సబ్ కమిటీ సభ్యులు జిల్లా కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం డిమాండ్స్ తో కూడిన మెమోరండాన్ని జిల్లా కలెక్టర్ కి సమర్పించడం జరిగింది.

నల్ల బాలకృష్ణారావు

జిల్లా ప్రధాన కార్యదర్శి

పార్వతిపురం మన్యం జిల్లా

Join WhatsApp

Join Now

Leave a Comment