*ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించిన ఆరె కులస్తులు*
*
సంవత్సరం నిర్వహించే పోచమ్మ బోనాలు శివసత్తుల పూనకాలతో డప్పు చప్పులతో గ్రామ పురవీధుల గుండా మహిళలందరూ బోనాలు ఎత్తుకొని పోచమ్మ దేవస్థానానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో ఆరె కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అదే తరుణంలో ఈ సంవత్సరం గ్రామంలోని పురవీధుల గుండా ఓడి బియ్యం పోసుకొని శివసత్తుల పూనకాలతో డప్పు చప్పులతో మహిళలందరూ బోనాలు ఎత్తుకొని పోచమ్మ తల్లి వద్దకు చేరుకొని బోనాలు ఆలయ ప్రాంగణంలో పెట్టి మొక్కులను చెల్లించుకున్నారు మహిళలు మాట్లాడుతూ గ్రామమంతా పాడి పంటలతో విరజిల్లాలని గ్రామానికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఘనంగా పోచమ్మ తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆరె కులం సంఘ నాయకులు తిప్పారపు వీరన్న శంకర్రావు ఇంగ్లె లక్ష్మయ్య సంతాజి ఎరబాటి కృష్ణ గారంపల్లి ఆగయ్య శ్రీనివాసు ఇంగ్లె రామారావు కిషన్ రావు ఆనందరావు లక్ష్మయ్య సంతాజి రవి తదితరులు పాల్గొన్నారు