*వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభకు ఏర్పాట్లు ముమ్మరం!*
*హైదరాబాద్: ఏప్రిల్ 21*
ఈనెల 27న నిర్వహించే రజతోత్సవ సభకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జిల్లా నుంచి గులాబీ శ్రేణులు భారీగా తరలి వెళ్లి కేసీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటేందుకు ఎదురుచూస్తున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనసమీకరణ, ఇతర అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, పార్టీ బాధ్యులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఇటీవల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ జిల్లాల అధ్యక్షలు, ఎమ్మె ల్యేలు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రెండు లక్షల మంది పార్టీ శ్రేణులు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాల నుంచి రెండు లక్షల మంది.. సిద్దిపేట నియోజకవర్గం నుంచి 20 వేల మందికి పైగా సభకు వెళ్లేందుకు ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు, యువత, రైతులు అందరూ సభకు వెళ్లనున్నారు. గజ్వేల్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీశ్రావు పాల్గొని పార్టీ నేతలకు సూచనలు చేశారు.
గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, నాయకులు మాదాసు శ్రీనివాస్ ఇతర నాయకులు సభ విజయ వంతంపై దృష్టిసారించారు. గజ్వేల్ నుంచి 20 వేల మందికి పైగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో సుమారు 20 వేల మంది శ్రేణులు వెళ్లేందకు సిద్ధమవుతున్నారు.
సభకు అతి దగ్గరగా ఉన్న హుస్నాబాద్ నియోజక వర్గం నుంచి ఎక్కువ మొత్తంలో వెళ్లనున్నారు. జనగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మాన కొండూరు నుంచి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతు న్నాయి.
మెదక్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఇతర నేతల నేతృత్వంలో సుమారుగా 10 వేల మంది, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో సభకు వేలాది గా వెళ్లేందుకు చురుగ్గా ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రజతోత్సవ సభ జహీరా బాద్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాలకు దూరంగా ఉండడంతో ఇక్కడి నుంచి 4 నుండి 5 వేల మంది ముఖ్యనేతలు, పార్టీ నాయకులు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఎటు చూసినా వరంగల్ సభ వాల్ రైటింగ్లు జిల్లాలో పెద్దఎత్తున కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో విస్తృత ప్రచా రం చేస్తున్నారు. మండలం, గ్రామాల వారీగా పార్టీ నాయకలు సమావేశాలు నిర్వహించుకొని సభకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అవసరమైన బస్సులు, డీసీఎంలు, ఇతర వాహనాలను బుకింగ్ చేశారు. ఆయా నియోజ కవర్గాలకు అవసరం మేరకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను బుక్ చేసుకున్నారు.