Site icon PRASHNA AYUDHAM

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ 

IMG 20250623 WA0386

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్

(ప్రశ్న ఆయుధం)జూన్ 23

ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని నిజాంసాగర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాలు.. మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన శేఖర్ కుటుంబంతో కలిసి పని నిమిత్తం రెండు రోజులు హైదరాబాద్ వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అత్రం ప్రశాంత్ తాళం వేసిన ఇంటిని గమనించి ఇంట్లో చొరబడి 40 తులాల వెండి, 20,000 నగదును దోచుకెళ్లాడు. ఈ నెల 8న దొంగతనం జరిగిన విషయం స్థానికులు శేఖరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి 10వ తేదీన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సోమవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు ప్రశాంతను అదుపులోకి తీసుకుని విచారించగా.. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసు నిందితుడిని అదుపులోకి తీసుకొని నిందితుడి వద్ద నుండి 40 తులాల వెండి ఆభరణాలను, పదివేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Exit mobile version