గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

నిజామాబాద్  ఫిబ్రవరి 02

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్​ నుంచి వచ్చి మండలంలోని వివిధ గ్రామాల్లో గంజాయి అమ్ముతున్న షేక్ అఫ్రోజ్​, షేక్ మహబూబ్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామన్నారు. నిందితుల నుంచి రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment